‘జై భీమ్’ సినిమా విషయంలో బీజేపీ రాజకీయం.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్

by Disha Web Desk |
‘జై భీమ్’ సినిమా విషయంలో బీజేపీ రాజకీయం.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా : 69వ నేషనల్ అవార్డు అనౌన్స్‌మెంట్ జరిగినప్పటి నుంచి ‘జై భీమ్’ గురించి చర్చ జరుగుతూనే ఉంది. అణగారిన కులాలకు న్యాయం జరగాలనే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం సమాజంలో కుల రాజకీయానికి వ్యతిరేకంగా గొంతెత్తింది. అయితే ఈ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాకపోవడంపై సినీ లవర్స్, క్రిటిక్స్ బాధపడ్డారు. నేచురల్ స్టార్ నాని కూడా హార్ట్ బ్రేకింగ్‌గా ఉందని పోస్ట్ పెట్టగా.. ఓ వర్గం విమర్శలు ఎదుర్కోక తప్పట్లేదు. అయితే తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాశ్ రాజ్ కూడా ‘జై భీమ్’ సినిమా గురించి పోస్ట్ పెట్టాడు. ‘మహాత్ముని హత్యను సమర్థించే వారు.. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకునే వారు.. #JaiBheemను సెలబ్రేట్ చేసుకుంటారా?’ అని ప్రశ్నిస్తూ.. బీజేపీపై ఇండైరెక్ట్‌గా సెటైర్స్ వేశాడు.

Read More: పవిత్రతో పెళ్లిపై నరేష్ కొడుకు సంచలన వ్యాఖ్యలు.. ఫిల్మ్ నగర్‌లో మొత్తం అదే టాక్!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed